SPB పై పుకార్లు నమ్మోద్దంటూ చరణ్
By: chandrasekar Mon, 24 Aug 2020 2:58 PM
కరోనా కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న SPB పై పలు రూమర్లు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ పలు వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై స్పందించిన చరణ్ అవన్నీ అవాస్తవం అని అన్నారు.
నాన్న ప్రస్తుతం వెంటిలేటర్పైనే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది. నాన్న ఆరోగ్యం గురించి నేనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను పుకార్లు నమ్మోద్దంటూ చరణ్ కోరారు. ప్రముఖ గాయకుడు అనారోగ్యానికి లోనవడంతో యావత్ సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి లోనైనా సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బాలు ఎంజీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సపోర్ట్తో చికిత్స జరుగుతుంది. కాగా, ఈ నెల 5న ఎస్పీ బాలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆగష్టు 14
వ తేదీ వరకు బాలు ఆరోగ్యం బాగానే వున్నది ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో 19
నుండి ఎక్మో చికిత్స మొదలు పెట్టారు. త్వరగా కోలకుకోవాలని అశేష సినీలోకం మరియు అతని అభిమానులు అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.