‘సర్కారువారి పాట’ చిత్రీకరణలో మార్పు
By: chandrasekar Wed, 28 Oct 2020 8:26 PM
పరశురామ్ దర్శకత్వంలో
మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14
రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు కలిసి
నిర్మిస్తున్నాయి.
కీర్తీ సురేశ్ కథానాయిక.
విద్యా బాలన్, అరవింద్ స్వామి ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.
బ్యాంక్ స్కామ్ల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం.
‘సర్కారువారి పాట’ చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో
జరగనున్న సంగతి తెలిసిందే. చిత్రబృందం నవంబర్లో అమెరికాలో 45
రోజులపాటు చిత్రీకరణ జరపాలనుకున్నారు.
తాజాగా ఈ ప్లాన్లో చిన్న
మార్పు జరిగిందట. ‘సర్కారువారి పాట’ చిత్రబృందం జనవరి నెలలో అమెరికా ప్రయాణం
కాబోతున్నారు. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో
కంప్లీట్ చేయనున్నారు.
Tags :
change |
filming |