విజయనగరం, గుంటూరు జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలలో మార్పు
By: chandrasekar Thu, 16 July 2020 12:35 PM
ఆంధ్రప్రదేశ్లో వేల
సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ
కారణంగా విజయనగరం జిల్లాలో గురువారం నుంచి పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు కానుంది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
లాక్డౌన్ నిబంధనల
ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు, మద్యం
అమ్మకాలకు అనుమతిచ్చారు. మెడికల్ షాపులు, ఆస్పత్రులు యధాతథంగా కొనసాగుతాయి.
దేవాలయాలు, ప్రార్థనా
స్థలాలకు కలెక్టర్ అనుమతి నిరాకరించారు. అలాగే వివాహాలకు 50
మందికి, అంత్యక్రియలకు
20
మందికి మాత్రమే అనుమతించారు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, పురపాలక
సంఘాలతో పాటు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో గురువారం నుంచి ఈ నెల 21వ తేదీ
వరకు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
అలాగే గుంటూరు జిల్లా
గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో సైతం గురువారం నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు
గురజాల ఆర్డీవో పార్థసారథి ప్రకటించారు. ఇకపై ఉదయం 6 గంటల
నుంచి 9 గంటల
వరకు మాత్రమే నిత్యవసరాల కొనుగోలుకు అనుమతి ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం
పాటించాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పార్థసారథి
చెప్పారు.