2021 మొదట్లోనే చంద్రయాన్-3 ప్రయోగం
By: chandrasekar Mon, 07 Sept 2020 8:24 PM
చంద్రయాన్ 2 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మిషన్పై శాస్త్రవేత్తలంతా తలమునకలైనట్లు తెలిసింది. ఓ భారీ ప్యానెల్, మూడు సబ్ కమిటీలతోపాటూ నాలుగు ఉన్నతస్థాయి మీటింగ్స్ కూడా నిర్వహించినట్లు సమాచారం. చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి చంద్రయాన్ 3లో ఆర్బిటర్ అనేది ఉండదు. ఓన్లీ ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని తెలిసింది. 2021 మొదట్లోనే చంద్రయాన్-3 ప్రయోగం చేయనున్నట్లు మంత్రి తెలియజేసారు. చంద్రుడిపైకి చంద్రయాన్-3 మిషన్ను వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష శాఖకు చెందిన సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్-2తో పోలిస్తే చంద్రయాన్-3 భిన్నంగా ఉంటుందన్నారు.
వచ్చే సంవత్సరం ప్రయోగించబోయే చంద్రయాన్-3లో ఆర్బిటర్ ఉండదన్నారు. కానీ ఆ ప్రాజెక్టులో ల్యాండర్, రోవర్ ఉన్నాయన్నారు. 2021 మొదట్లోనే చంద్రయాన్-3ను ప్రయోగించనున్నట్లు చెప్పారు. చంద్రయాన్-2ను 2019లో ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. వాస్తవానికి చంద్రయాన్-3ని 2020లో లాంచ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల ఆ ప్లాన్ ఆలస్యమైంది. లాక్డౌన్ వల్ల చంద్రయాన్-3 ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. చంద్రయాన్-2ను 2019 జూలై 22న ప్రయోగించారు. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది. కానీ ఆర్బిటార్ మాత్రం డేటాను పంపిస్తూనే ఉన్నది. అయితే మరోవైపు 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 పంపిన ఫోటోలు తాజాగా ఓ కొత్త విషయాన్ని తేల్చాయి. చంద్రుడి ద్రువాలు తుప్పుపట్టిపోతున్నట్లు ఆ ఫోటోలు వెల్లడించాయి. నాసా శాస్త్రవేత్తలు దీన్ని ద్రువీకరించారు.
చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. చంద్రయాన్–2 ప్రయోగంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చంద్రయాన్–3పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–2 కంటే చంద్రయాన్–3 ప్రయోగానికి తక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు.