Advertisement

  • గురుప్రతాప్ రెడ్డి హత్య కేసులో డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబునాయుడు...

గురుప్రతాప్ రెడ్డి హత్య కేసులో డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబునాయుడు...

By: chandrasekar Fri, 11 Dec 2020 11:54 PM

గురుప్రతాప్ రెడ్డి హత్య కేసులో డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబునాయుడు...


టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు రెండవసారి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించారు.

వైసీపీ అవినీతిని బయటపెట్టినందుకే గురుప్రతాప్ రెడ్డిని దారుణంగా చంపేశారని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.

రాష్ట్రంలో అవినీతి శక్తుల అరాచకాలకు కళ్లెం వేయాలని డీజీపీని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో చట్టాన్ని నిలబెట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags :
|

Advertisement