ఆసక్తికర ట్వీట్ చేసిన చంద్రబాబు
By: chandrasekar Fri, 28 Aug 2020 10:39 AM
భారత్ నుంచి ఎగుమతుల విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరు ఆధారంగా నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత సూచి-2020 ర్యాంకుల్ని విడుదల చేసింది. తెలంగాణకు 6వ స్థానం దక్కగా.. ఏపీకి మాత్రం 20వ స్థానంలో ఉంది. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఎగుమతుల సన్నద్దత సూచి 2020లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు.
అతి పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం కనీసం ఇతర 8 తీర ప్రాంత రాష్ట్రాలతో కూడా పోటీ పడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అన్నారు. పోర్టులు లేకున్నా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే, 11 మైనర్ పోర్టులు, 1మేజర్ పోర్టు ఉన్నప్పటికీ ఏపి ఇలా దిగజారడం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. తీరప్రాంత రాష్ట్రమైనా పాలసీపరంగా ఏపీ పనితీరు నాసిరకంగా ఉందని"
నీతి అయోగ్ వ్యాఖ్యానించడం కన్నా అవమానం ఏముందన్నారు బాబు.
దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరు ఆధారంగా నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత సూచి-2020 ర్యాంకుల్ని విడుదల చేసింది. ఇందులో తెలంగాణ 6,
ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలిచాయి. ఎగుమతుల సన్నద్ధతలో
100కు గాను
75.19 స్కోర్తో గుజరాత్కు మొదటి ర్యాంకు లభించగా.. 75.14 స్కోర్తో మహారాష్ట్రకు రెండో ర్యాంకు,
64.93 స్కోర్తో తమిళనాడుకు మూడో ర్యాంకు వచ్చింది. ఇక 57.43 స్కోర్తో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. 35.58 స్కోర్తో 20వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.