టిడిపి మహానాడు 2020 ప్రారంభించిన చంద్రబాబు
By: chandrasekar Wed, 27 May 2020 6:03 PM
మంగళగిరి పార్టీ కేంద్ర
కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి టిడిపి మహానాడు 2020 ప్రారంభించారు. ప్రారంభంలో ఎన్టీఆర్ విగ్రహానికి
పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్
బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి
చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. 12 గంటల నుంచి మహానాడుకు హాజరైన పార్టీ ప్రతినిధులను
ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించడం ప్రారంభించారు.
ముందుగా అనుకున్న
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటల
నుంచి మధ్యాహ్నం 1 గంటల
వరకు తిరిగి సాయంత్రం 4 గంటల
నుంచి 5.30 గంటల వరకు మహానాడు సదస్సులు జరగనున్నాయని
తెలుస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి, లాక్
డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో
పార్టీ నేతలను, కార్యకర్తలను
మహానాడుకు ఆహ్వానించే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆన్లైన్ ద్వారా జూమ్ యాప్లో
వర్చువల్ మహానాడు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
దాదాపు 14 వేల మంది మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా పార్టీ
సాంకేతిక బృందం ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణలోని
తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు
పార్టీ సూచనల మేరకు ఆన్లైన్ ద్వారా టీడీపీ మహానాడు 2020లో పాల్పంచుకోనున్నారు. జూమ్ యాప్ సౌకర్యం అందుబాటులో
లేని మిగతా నేతలు, కార్యకర్తలు, అభిమానులు టిడిపి అధికారిక వెబ్సైట్, ఫేస్బుక్ ద్వారా మహానాడు ప్రత్యక్షప్రసారాన్ని
వీక్షించేవిధంగా పార్టీ ఏర్పాట్లు చేసుకుంది.