21న తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు
By: Sankar Wed, 20 May 2020 3:57 PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
నిరసనలకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో కష్టాలు పడుతున్న
సామాన్యుడి సమస్యలు పట్టిచుకోకపోవడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి మరిన్ని
కష్టాల్లోకి నెట్టేశారంటూ విమర్శలు చేసారు. ఇప్పటికే దేశంలోని డిస్కంలకు కేంద్ర
ప్రభుత్వం రూ.90 వేల కోట్లు రాయితీలు ఇచ్చిందని గుర్తు చేశారు.
అయినప్పటికీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో విద్యుత్ ధరలు
పెంచడమేంటని చంద్రబాబు నిలదీశారు.
21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చేయాలని చంద్రబాబు
నాయుడుగారు సూచించారు. కావున టిడిపి నేతలు, కార్యకర్తలు అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో
ఇళ్లలోనే ఉండి నిరసనలు చేపట్టాలన్నారు. విద్యుత్ ఛార్జీలను దాదాపు నాలుగు రెట్లు
పెంచడం దారుణమని ఆయన సూచించారు.