ఆడిషన్స్కు నగ్న ఫొటోలు పంపితే నటిగా ఛాన్స్
By: chandrasekar Tue, 22 Sept 2020 11:42 AM
ఇన్స్టాగ్రామ్లో మహిళా
మోడల్గా చలమణి అవుతూ ఉద్యోగాల ఆశ చూపి పలువురు మహిళలను మోసగించిన వ్యక్తిని
ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మాం చంద్ అలియాస్ దీపక్గా
పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే
.. ఇన్స్టాగ్రామ్లో రాశీ గోయల్ పేరుతో దీపక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తాను ఓ
నిర్మాణ సంస్థలో మోడల్గా పనిచేస్తున్నానని ఓ వెబ్ సిరీస్ కోసం కొత్త నటీమణుల
కోసం అన్వేషిస్తున్నామని యువతులకు వల విసిరాడు. ఇలా ఓ యువతిని సైతం మోడల్గా
పరిచయం చేసుకుని, తమ వెబ్సిరీస్లో కొత్త నటిగా చాన్స్ ఇస్తామంటూ
నమ్మించాడు. యువతి నమ్మినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఆడిషన్స్ కోసం నగ్న ఫొటోలు
పంపాలని మెసేజ్ చేశాడు. దీంతో ఓసారి ఆ దుర్మార్గుడికి నగ్న ఫొటోలు పంపించింది.
అయితే పదేపదే అలాంటి ఫోటోలు పంపాలని కోరడంతో ఇన్స్టాగ్రాంలో ఆ ఖాతాను యువతి
బ్లాక్ చేసింది.
తర్వాత సదరు యువతికి
ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తాము చెప్పినట్లు వినకపోతే
తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వేధింపులకు గురిచేశారని యువతి వాపోయింది. ఇక, వేధింపులు
తట్టుకోలేని యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో
రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా యువతి
ద్వారా నిందితుడికి ఫోన్ చేయించారు. అతడు ఫోన్ చేయడంతో పోలీసులు ట్రాప్ చేసి..
ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుడు సుల్తాన్పురిలోని ఇంట్లో ఉన్నట్లు కనుగొన్నారు.
వెంటనే పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే
సదరు నిందితుడు అంతకుముందే ఓ కేసులో హరియాణాలోని హిసార్లో ఓసారి అరెస్ట్
అయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత విషయాలు
పంచుకోవద్దని యువతులకు పోలీసులు సూచించారు.