తర్వాతి మ్యాచ్లో క్రిస్ గేల్ బరిలో దిగే ఛాన్స్
By: chandrasekar Fri, 02 Oct 2020 6:10 PM
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ఐపీఎల్ 2020లో
ఇప్పటి వరకూ 4 మ్యాచ్లు ఆడి ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఢిల్లీ, రాజస్థాన్లతో
జరిగిన మ్యాచ్లో ఆ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్
రాహుల్ అద్భుతంగా రాణిస్తుండటంతో పంజాబ్ విజయాలపై ధీమాతో ఉంది. కానీ ముంబైతో
జరిగిన మ్యాచ్లో ఓడిన తర్వాత పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి దిగి౦ది. ఈ
సీజన్లో పంజాబ్ క్రిస్ గేల్ ఆడలేదు. ఓపెనర్గా బరిలో దిగిన మయాంక్ అగర్వాల్
సక్సెస్ కావడంతో గేల్కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. గేల్ ఓపెనర్గా ఆడితే
విధ్వంసం సృష్టిస్తాడు. కానీ మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తే కుదురుకోవడానికి
కాస్త టైం పడుతుంది.
మ్యాచ్ల్లో పూరన్, మ్యాక్స్వెల్లు
చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చకపోయినా రాహుల్ వారిపై నమ్మకం ఉంచాడు. కానీ ముంబైతో
జరిగిన మ్యాచ్లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలోనూ వీరు
కాపాడలేకపోయారు. 27 బంతుల్లో 44 రన్స్ చేసిన పూరన్ ముంబై బౌలర్లపై ఎదురు దాడికి
ప్రయత్నించాడు. కానీ మ్యాక్స్వెల్ మాత్రం 18 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేశాడు. ఐపీఎల్ కంటే ముందు ఇంగ్లాండ్తో
జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ, మ్యాక్స్వెల్ శతకాలు బాది జట్టును గెలిపించారు.
ఐపీఎల్లోనూ మ్యాక్స్వెల్ సత్తా చాటుతాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశించింది. కానీ
వరుసగా 1, 5, 13 నాటౌట్, 11 చొప్పున మాత్రమే పరుగులు రాబట్టాడు. రెండు మ్యాచ్ల్లో
బౌలింగ్ చేసి ఒకే వికెట్ తీశాడు. మ్యాక్స్వెల్ లేదా పూరన్ బదులు క్రిస్ గేల్ను
తుది జట్టులోకి తీసుకుంటే పంజాబ్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంది.
ముంబైతో జరిగిన మ్యాచ్లో
ఐదో బౌలర్ స్థానంలో ఆల్రౌండర్ జేమ్స్ నీషామ్ను జట్టులోకి తీసుకున్నారు. కానీ
ఆఖరి ఓవర్లలో అతడు భారీగా పరుగులిచ్చాడు. అతడి స్థానంలో బౌలర్ను తీసుకొని ఉంటే ఈ
స్థాయిలో డ్యామేజ్ జరిగి ఉండేది కాదనే భావన కూడా వ్యక్తం అవుతోంది. గేల్ జట్టులో
ఉండటం సంతోషంగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్లో అతడు
బరిలో దిగే ఛాన్స్ ఉంది.