Advertisement

హైకోర్టులో సవాల్...ముస్లిం లా బోర్డు

By: chandrasekar Thu, 01 Oct 2020 12:38 PM

హైకోర్టులో సవాల్...ముస్లిం లా బోర్డు


సీబీఐ ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, జోషి, ఉమా భారతి సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ బుధవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది.

ముస్లిం సంస్థలతో కలిసి దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి తెలిపారు. మరోవైపు దీనిపై కచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్‌యాబ్ జిలానీ పేర్కొన్నారు.

ఈ కేసులో వందలాది మంది సాక్ష్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. నిందితులు స్టేజీపై కూర్చొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు సాక్ష్యం ఇచ్చారని, సీబీఐ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.

ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర కాదని, ఆ పరిస్థితుల్లో కొందరు సంఘ విద్రోహ శక్తులు బాబ్రీ కూల్చివేతకు పాల్పడ్డారని సీబీఐ కోర్టు తన తీర్పులో పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు.

Tags :
|
|

Advertisement