సీటింగ్ ఏర్పాట్ల ప్రకారం రాజ్యసభ మాక్ సెషన్ నిర్వహించిన చైర్మన్ వెంకయ్య
By: chandrasekar Fri, 11 Sept 2020 09:28 AM
పార్లమెంటు వర్షాకాల
సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. రాజ్యసభ చైర్మన్ ఎం
వెంకయ్యనాయుడు సమావేశాలు నిర్వహించేందుకు చేసిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించారు. భౌతిక దూర నిబంధనలను దృష్టిలో
ఉంచుకుని ఇప్పటికే కేటాయించిన సీటింగ్ ఏర్పాట్ల ప్రకారం సభలో మాక్ సెషన్
నిర్వహించారు. చాంబర్ తోపాటు సభ యొక్క నాలుగు గ్యాలరీలు సచివాలయ సిబ్బందితో నింపి
పరిశీలించారు. సభలోని ఒక చాంబర్ నుంచి
మరొకదానికి ఆడియో, వీడియో సిగ్నల్స్ ప్రసారం చేసే ప్రతి అంశాన్ని
క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంటర్ప్రెటేషన్ సిగ్నల్స్ కూడా బాగా పనిచేస్తున్నట్లు
గుర్తించారు.
చాంబర్ ఆఫ్ లోక్ సభలో
కూర్చున్నవారిని చర్చలో పాల్గొనమని సూచించారు. మూడు చోట్ల స్లిప్ల పంపిణీ ద్వారా
నమూనా ఓటింగ్ ప్రక్రియ కూడా చేపట్టారు. సభ నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై
వెంకయ్యనాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. హోం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు జారీ చేసిన అన్ని
మార్గదర్శకాలను చాలా సూక్ష్మంగా పాటించేలా చూడాలని సచివాలయ సీనియర్ అధికారులను
ఆదేశించారు. రాబోయే సెషన్కు ముందు ఆరోగ్య ప్రోటోకాల్ల గురించి సభ్యులను గుర్తు
చేయాలని అధికారులకు సూచించారు.
సభ యొక్క ప్రతి సభ్యుడిని
పరీక్షించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. గత రెండు రోజులుగా టెస్టింగ్
ప్రాసెసింగ్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యుడు పరిమల్
నాత్వానీకి తన చాంబర్లో ప్రమాణ స్వీకారం జరపించారు. 2020 జూలై 22 న
ప్రమాణ స్వీకారం చేయలేని మిగిలిన సభ్యులకు ప్రమాణం / ధృవీకరణ సెషన్ మొదటి రోజున
నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.