Advertisement

  • కూతుర్ని తన సామ్రాజ్యానికి రాణి ని చేసిన హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్

కూతుర్ని తన సామ్రాజ్యానికి రాణి ని చేసిన హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్

By: chandrasekar Sat, 18 July 2020 8:01 PM

కూతుర్ని తన సామ్రాజ్యానికి రాణి ని చేసిన హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్


బిగ్ బిజినెస్‌మెన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్. ఈయన ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శివ్ నాడార్ ప్రకటించారు. రోష్ని నాడార్ మల్హోత్రా ఈయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. అది కూడా వెంటనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె ఎవరో కాదు. శివ్ నాడార్ కూతురు. ఈమె దేశంలోని అత్యంత మహిళా సంపన్నురాలు. ఇక శివ్ నాడార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.

1945 జూలై 14న శివ్ నాడర్ జన్మించినారు . ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో భారత్ దూసుకెళ్తోందంటే ఈయన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈయనది తమిళనాడు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్ కూడా ఒకటి. రూ.1.7 లక్షల కోట్ల స్థాయికి ఆయన తన బిజినెస్ ను వృద్ధి చేశారు,

ఒక ఇంటర్వ్యూలో శివ్ నాడర్ మాట్లాడుతూ.. నేను తొలిసారి కలిసిన వ్యక్తి అర్జున్. ఈయన కూడా నాలాగే మేనేజ్‌మెంట్ ట్రైనీ. ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. ఇప్పటికీ కూడా తమ స్నేహం కొనసాగుతోంది. డీసీఎంలో మాలాగే పనిచేసే మరి కొంత మందిని చేర్చుకున్నాం. కలిసి పనిచేశాం’ అని వివరించారు.

అతి కొద్దీ కాలము లోనే ఆ కంపెనీ హిందుస్తాన్ కంప్యూటర్స్‌ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)గా ఆవిర్భవించింది. కంప్యూటర్లు తయారు చేయడం ప్రారంభించినది . హెచ్‌సీఎల్ తరువాత ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బ్రాండ్‌గా అవతరించింది. 1980లో ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్‌తో పేరుతో సింగపూర్‌లో ఐటీ హార్డ్‌వేర్‌ను విక్రయించారు. 1982లో హెచ్‌సీఎల్ పర్సనల్ కంప్యూటర్లను మార్కెట్‌లోకి తెచ్చింది.ఇక అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

Tags :

Advertisement