Advertisement

  • మ్యాచ్ మధ్యలో వచ్చి టీమిండియాను గెలిపించిన చాహల్

మ్యాచ్ మధ్యలో వచ్చి టీమిండియాను గెలిపించిన చాహల్

By: Sankar Fri, 04 Dec 2020 6:19 PM

మ్యాచ్ మధ్యలో వచ్చి టీమిండియాను గెలిపించిన చాహల్


ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడు టిట్వంటీ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది...అయితే ఈ మ్యాచ్ లో హైలైట్ అంటే చాహల్ ప్రదర్శన ...

ముందుగా ప్రకటించిన తుది జట్టులో చాహల్ కు చోటు దక్కలేదు ..అయితే టీంఇండియా బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్లో స్టార్క్ వేసిన బంతి జడేజా తలకు బలంగా తాకడంతో జడేజా స్థానంలో కాంకేషన్ సబ్స్టిట్యూట్ ఆ చాహల్ వచ్చాడు...అయితే ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం కాంకేషన్ సబ్స్టిట్యూట్ బ్యాటింగ్ , బౌలింగ్ చేయవచ్చు ..

దీనితో జడేజా వేయవలసిన నాలుగు ఓవర్లు వేసిన చాహల్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూయించాడు...నాలుగు ఓవర్లో మూడు కీలక వికెట్లు తీసుకొని మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు ..అయితే చాహల్ బౌలింగ్ చేయడంపై ఆస్ట్రేలియా కోచ్ లంగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మ్యాచ్ రిఫరీ తో మాటల యుద్దానికి దిగాడు..

Tags :
|

Advertisement