Advertisement

  • పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడం లేదు ..బీజేపీ

పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడం లేదు ..బీజేపీ

By: Sankar Sun, 22 Nov 2020 9:28 PM

పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడం లేదు ..బీజేపీ


నగర అభివృద్ధిపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫిలింనగర్‌లో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి జవదేకర్ ఆదివారం ప్రారంభించారు.

కిషన్‌రెడ్డి, డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు..

కేసీఆర్‌, కేటీఆర్‌లు హైదరాబాద్‌ను వరదల నగరంగా మార్చారని డీకే అరుణ ధ్వజమెత్తారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రగతిభవన్ బాగుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శలు గుప్పించారు.

Tags :

Advertisement