తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు - కిషన్ రెడ్డి
By: Anji Sun, 06 Dec 2020 4:41 PM
2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ విజయాన్ని కేసీఆర్, ఒవైసీ అడ్డుకోలేరన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి... టీఆర్ఎస్, ఎంఐఎంపై ఘాటు విమర్శలు చేశారు. పాతబస్తి ప్రజల్లో ఎంఐఎం అధినేత ఒవైసీ పట్ల వ్యతిరేకత కనిపించిందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీజేపీని ఆశీర్వదించి 48 సీట్లు ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మినీ తెలంగాణ అని... ఇక్కడి ఫలితాలు రాష్ట్రమంతా వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్, ఒవైసీ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని.. ఇద్దరూ కలిసి కేసీఆర్ నివాసంలో బిర్యానీ తిన్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Tags :