Advertisement

  • నెలలో రెండు సార్లు ప్లాస్మా దానం చేయవచ్చు ..కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్..

నెలలో రెండు సార్లు ప్లాస్మా దానం చేయవచ్చు ..కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్..

By: Sankar Sun, 19 July 2020 6:13 PM

నెలలో రెండు సార్లు ప్లాస్మా దానం చేయవచ్చు ..కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్..



కరోనా మహమ్మారి నివారణకు ప్లాస్మా దానం అనేది అద్భుత ఔషదంలాగా ఉపయోగపడుతుండటంతో రాజకీయ నాయకులూ , ప్రభుత్వాలు , సెలబ్రిటీలు ఇలా అందరూ ప్లాస్మాదానం మీద ప్రజల్లో అవగహన పెంచుతున్నారు ..ప్లాస్మా దానంపై ఢిల్లీ పోలీసులు ఎయిమ్స్ దవాఖానలో ఆదివారం చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రారంభించారు ..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నెలలో రెండుసార్లు ప్లాస్మా దానం చేయవచ్చని అన్నారు ..

ఈ కార్యక్రమం సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న పోలీసులు ప్లాస్మా దానం చేశారు. మంత్రి హర్ష వర్ధన్ వారిని అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2,532 మంది ఢిల్లీ పోలీసులు కరోనా బారిన పడ్డారని, వారిలో కొందరు కోలుకుని ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారని తెలిపారు. కరోనాపై గెలిచిన పోలీసు వారియర్లు ప్రస్తుతం ప్లాస్మా వారియర్లుగా మారారని ఆయన కొనియాడారు.

మరోవైపు కరోనా సోకిన పోలీసుల్లో 84 శాతం మంది కోలుకున్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్మాను దానం చేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల అవసరమైన కరోనా రోగులకు తమ పోలీసులు ప్లాస్మా దానం చేస్తారని ఆయన చెప్పారు. పోలీసుల ప్లాస్మా దానం, దీనిపై తమ ప్రచారం వల్ల ఇతరులు కూడా ముందుకు వచ్చేందుకు దోహదపడుతుందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

Tags :
|
|

Advertisement