Advertisement

  • వీసా నిబంధ‌న‌ల‌ను తొలగించిన కేంద్ర ప్ర‌భుత్వం...

వీసా నిబంధ‌న‌ల‌ను తొలగించిన కేంద్ర ప్ర‌భుత్వం...

By: chandrasekar Fri, 23 Oct 2020 1:30 PM

వీసా నిబంధ‌న‌ల‌ను తొలగించిన కేంద్ర ప్ర‌భుత్వం...


వీసా నిబంధ‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం స‌డ‌లించింది. అన్ని వ‌ర్గాల‌ విదేశీయులు భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు అనుమ‌తి ఇచ్చారు. అయితే ప‌ర్యాట‌కం కోసం భార‌త్‌లో విజిట్ చేసేందుకు విదేశీయుల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

పీఐఓ, ఓసీఐ కార్డులు ఉన్న‌వారితో పాటు విదేశీయుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. భార‌తీయుల‌తో పాటు విదేశీయుల‌కు కూడా ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు పేర్కొ౦ది.

పౌర విమాన‌యాన‌శాఖ ఆమోదించిన విమానాల‌కు మాత్ర‌మే ఈ ఆంక్ష‌లు వ‌ర్తించ‌నున్నాయి. కరోనా నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ జారీ చేసిన నిబంధ‌న‌లను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ఎల‌క్ట్రానిక్‌, టూరిస్ట్‌, మెడిక‌ల్ వీసాలు త‌ప్ప ఇత‌ర అన్ని వీసాల‌ను పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. తాజా ఆదేశాల‌తో బిజినెస్‌, కాన్ఫ‌రెన్స్‌, ఉద్యోగం, విద్య‌, ప‌రిశోధ‌న‌, వైద్య సంబంధిత విష‌యాలకు హాజ‌ర‌య్యేందుకు విదేశీయుల‌కు అనుమ‌తి ఇచ్చారు.

Tags :
|

Advertisement