Advertisement

  • జాతీయ దినోత్సవం రోజున రైతులు ఇలా రోడ్ల మీద ఉండటం బాధాకరం ....మంత్రి నిరంజన్ రెడ్డి

జాతీయ దినోత్సవం రోజున రైతులు ఇలా రోడ్ల మీద ఉండటం బాధాకరం ....మంత్రి నిరంజన్ రెడ్డి

By: Sankar Wed, 23 Dec 2020 11:57 AM

జాతీయ దినోత్సవం రోజున రైతులు ఇలా రోడ్ల మీద ఉండటం బాధాకరం ....మంత్రి నిరంజన్ రెడ్డి


రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని కోరారు మంత్రి నిరంజన్ రెడ్డి..పంటలకు మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

మద్దతు ధరకు పంటల కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేయడం వంటి 10 డిమాండ్లను కేంద్రం భేషరతుగా అంగీకరించాలన్నారు.దేశంలోని 50 రైతుసంఘాలు, 14 మిలియన్ల ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు మద్దతుగా పోరాడుతు న్నారు. భారత్‌బంద్‌కు మద్దతుగా 25 కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం దేశానికి మంచిదికాదన్నారు.

ఇక జాతీయ రైతు దినోత్సవం వేళ రైతులు రోడ్ల మీద ఉండటం బాధాకరమని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్లే ప్రపంచానికి అన్నంపెట్టే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎముకలు కొరికే చలిలోనూ 28 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఆందోళనల వల్ల ఇప్పటికే 41 మంది రైతులు చనిపోయారని వాపోయారు.

Tags :
|

Advertisement