Advertisement

  • కేంద్రం గుడ్ న్యూస్... నేరుగా బ్యాంక్ ఖాతాలోకే ఈ డబ్బులు వస్తాయి... ఎలానో తెలుసా...?

కేంద్రం గుడ్ న్యూస్... నేరుగా బ్యాంక్ ఖాతాలోకే ఈ డబ్బులు వస్తాయి... ఎలానో తెలుసా...?

By: Anji Wed, 09 Dec 2020 1:07 PM

కేంద్రం గుడ్ న్యూస్... నేరుగా బ్యాంక్ ఖాతాలోకే ఈ డబ్బులు వస్తాయి... ఎలానో తెలుసా...?

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6,000 లభిస్తాయి.

నేరుగా బ్యాంక్ ఖాతాలోకే ఈ డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ ఈ రూ.6 వేలు ఒకేసారి రావు. మూడు విడతల్లో బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి.

అంటే రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రైతులకు లభిస్తాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 6 ఇన్‌స్టాల్‌మెంట్ల డబ్బులను రైతులకు అందించింది. ఇప్పుడు 7 విడత డబ్బులు కూడా అందిస్తోంది.


మోదీ సర్కార్ ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తోంది. అయితే కొంత మందికి ఇంకా ఈ డబ్బులు వచ్చినట్లు లేదు.

అయితే మీ అకౌంట్‌లోకి రూ.2 వేలు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు.

మీరు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అందులో బెనిఫీషియరీ స్టేటస్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.

మీరు వీటిల్లో ఆధార్ కార్డు నెంబర్ ఎంచుకోండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు డబ్బులు వచ్చాయో.. లేదో.. వెంటనే తెలిసిపోతుంది. డబ్బులు రాకపోతే 6 ఇన్‌స్టాల్‌మెంట్లే చూపిస్తుంది. ఇంకా డబ్బులు రాని వారికి డిసెంబర్ 10న ఈ డబ్బులు రావొచ్చు.

Tags :

Advertisement