రెండు లక్షల కోట్ల రూపాయలతో కొత్త స్కీమ్ తీసుకొచ్చిన మోడీ సర్కార్
By: Sankar Wed, 11 Nov 2020 7:13 PM
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ మరో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. దేశంలోని 10 రంగాలకు ఊతం ఇచ్చే విధంగా ఈ స్కీమ్ ను రూపొందించారు.
దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. వాహన, వాహన విడిభాగాల రంగానికి ఊతం ఇచ్చేలా ప్యాకేజీ తీసుకొచ్చారు. వీటికోసం రూ.57 వేలకోట్ల రూపాయలను కేటాయించింది. అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రొడక్షన్, వైట్ గూడ్స్, టెక్స్ టైల్, టెలికం అండ్ నెట్వర్కింగ్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ వంటి రంగాలకు ఈ నిధులను కేటాయించారు.
పీఎల్ఐ స్కీం కింద వివిధ రంగాలకు ఆర్ధిక తోడ్పాటు లభిస్తుందని, దేశంలోకి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ మద్దతు అందిస్తుందని ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు.