Advertisement

  • నిజాముద్దీన్ మత సమావేశం లో నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్న విదేశీయులపై నిషేధం విధించిన కేంద్రం

నిజాముద్దీన్ మత సమావేశం లో నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్న విదేశీయులపై నిషేధం విధించిన కేంద్రం

By: Sankar Thu, 04 June 2020 8:03 PM

నిజాముద్దీన్ మత సమావేశం లో నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్న విదేశీయులపై నిషేధం విధించిన కేంద్రం

భారత్‌లో కరోనా కేసుల వ్యాప్తి అంతంతమాత్రంగానే ఉన్న దశలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మర్కజ్ మత కార్యక్రమం సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి ద్వారా దేశమంతా కరోనా వైరస్ వ్యాపించింది. పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన కొంత మంది విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా ఈ మత కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా విలయానికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2200కు పైచిలుకు విదేశీయులను కేంద్ర హోంశాఖ బ్లాక్ లిస్టులో పెట్టింది. వీరు పదేళ్ల పాటు భారత్‌లోకి రాకుండా నిషేధం విధించింది. వీరంతా నిబంధనలకు విరుద్ధంగా మర్కజ్‌ భవన్‌లో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఎక్కువగా మంది ఇండోనేషియా దేశానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ మత సమావేశం అనంతరం పలువురు తబ్లిగీ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మే 13 నుంచి 17 మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఒక్కసారిగా కేసులు అనూహ్యంగా పెరిగాయి.


Tags :
|
|
|

Advertisement