మెట్రో రైళ్లలో కరోనాను నియంత్రించేందుకు కేంద్రం సూచించిన SOPs నియమాలు
By: chandrasekar Thu, 03 Sept 2020 12:57 PM
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్లాక్ 4 మార్గదర్శకాలులో భాగంగా ఇటీవలే మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. ఇవాళ అందుకు సంబంధించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసిజర్ నియమావళిని విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన అన్లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీలోగా విడతల వారీగా గ్రేడెడ్ పద్ధతిలో దేశంలోని అన్ని మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మెట్రో రైళ్లలో కరోనాను నియంత్రించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. కేంద్రం సూచించిన ఎస్ఓపిఎస్ నియమాలు ఇలా ఉన్నాయి.
* ప్రయాణికులకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్పై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సేతు యాప్ వినియోగించేలా ప్రోత్సహించాలి.
* సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా మెట్రో స్టేషన్ పరిసరాల్లో, మెట్రో రైలులో మార్కింగ్ చేసిన గుర్తులపైనే నిలబడాల్సి ఉంటుంది.
* ప్రయాణికులతో పాటు మెట్రో రైలు సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి. మాస్కులు లేకుండా వచ్చే వారు మెట్రో స్టేషన్స్లో మాస్కులు కొనుగోలు చేసేలా మాస్కులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలి.
* స్మార్డ్ కార్డు, క్యాష్లెస్, ఆన్లైన్ టికెట్ కొనుగోలు పద్ధతులను ప్రోత్సహించాలి. టోకెన్స్,పేపర్ స్లిప్స్, టికెట్స్ను శానిటైజ్ చేయాలి.
* ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం లక్షణాలు లేనివారినే మెట్రో రైలు స్టేషన్లోకి అనుమతించాలి.
* మెట్రో రైలు స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులకు ప్రవేశద్వారం వద్దే శానిటైజర్ అందుబాటులో ఉండాలి.
* మెట్రో రైలుతో పాటు స్టేషన్లోని కౌంటర్స్, టాయిలెట్స్, లిఫ్ట్ వంటి అన్ని పరిసరాలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి.
* రైలు స్టేషన్లో వచ్చి ఆగినప్పుడు రైలు ఎక్కి, దిగే ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా తగినంత సమయం రైలు ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
* హైదరాబాద్, ఢిల్లీ, నొయిడా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, జైపూర్, కోల్కతా, గుజరాత్, లక్నో మెట్రో సేవల విషయంలో కేంద్రం విధించిన పై నిబంధనల మేరకే వారివారి సొంత నిబంధనలను రూపొందించుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నందున అక్టోబర్ 20
తర్వాతే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నట్టు కేంద్రం తెలిపింది.