పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ పై తెలంగాణకు ప్రశంసలందించిన కేంద్రం
By: chandrasekar Wed, 21 Oct 2020 09:45 AM
తెలంగాణ రాష్ట్రము
పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ లో 25 శాతం పూర్తిచేసి చూపించిందని ప్రశంస. పంచాయతీల ఆన్లైన్
ఆడిట్లో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం
ప్రశంసించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కే ఎస్ సేథి
మంగళవారం తెలంగాణ పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, తెలంగాణ
లోకల్ ఫండ్ ఆడిట్ సంచాలకులు మార్దినేని వెంకటేశ్వర్రావుకు లేఖలు రాశారు.
ప్రస్తుతం ఈ ఆర్థిక
సంవత్సరం 50శాతం పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ అమలు చేయాలని
పెట్టుకున్న లక్ష్యాన్ని రాష్ట్రప్రభుత్వం సులభంగా చేరుకోవాలని ఆకాంక్షించారు.
వచ్చే ఏడాదికి 100 శాతం పంచాయతీల్లో దీన్ని అమలుచేయాలని సూచించారు.
ఆడిట్ చేయడం, నివేదికలను ఆన్లైన్లో పొందుపరచడం, పంచాయతీలకు
నివేదికలు పంపించడం ఇలా ప్రతీ విషయంలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు బాగున్నాయని
కేంద్ర పంచాయతీరాజ్మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారని లేఖలో
పేర్కొన్నారు.
ఇప్పుడు తెలంగాణ ముందడుగు
వేసి మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాలు ఆన్లైన్ ఆడిట్ ప్రారంభ
దశలో ఉండగానే తెలంగాణ మాత్రం 3,225 పంచాయతీలు 25 శాతం పూర్తిచేసి చూపించిందని తెలిపారు. వచ్చేఏడాది 100 శాతం
ఆన్లైన్ ఆడిట్ చేసేందుకు వీలుగా ప్రతి పంచాయతీకి యూసర్ ఐడీలు క్రియేట్చేయాలని
అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్శాఖలకు లేఖలు
రాయనున్నట్టు వివరించారు.