కాశ్మీర్, లడఖ్కు రూ.520కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం...
By: chandrasekar Thu, 15 Oct 2020 6:34 PM
కేంద్ర జాతీయ గ్రామీణ
జీవనోపాధి మిషన్ కింద జమ్మూ కాశ్మీర్, లడఖ్కు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్యాకేజీకి ఆమోదం
తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ప్యాకేజీ కింద రెండు భూ భాగాలకు తగిన నిధులు ప్యాకేజీ ఇస్తుందన్నారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్లో కేంద్ర ప్రాయోజిత లబ్ధిదారుల పథకాలన్నింటినీ
సార్వజనీకరించాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్ఆర్ఎల్ఎం గ్రామీణ పేదల
స్థిరమైన జీవనోపాధి మెరుగుదల, ఆర్థిక సేవలను మెరుగుపరచడం ద్వారా గృహాల
ఆదాయాన్నిపెంచడం ఎన్ఆర్ఎల్ఎం లక్ష్యమని తెలిపారు.
Tags :
center |
packag |