సోషల్ మీడియా ద్వారా ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు
By: chandrasekar Wed, 08 July 2020 2:49 PM
మహేంద్ర సింగ్ ధోనీ తన
పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జూలై 7న తన 39వ
పుట్టినరోజును జరుపుకున్నారు. ధోనీకి ఆయన అభిమానులు, సహచర క్రికెటర్లు, సెలబ్రిటీలు
సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా
ఉన్నారు.
సాయి ధరమ్ తేజ్, సందీప్
కిషన్, ప్రణీత, పాయల్
ఘోష్, గోపీచంద్
మలినేని, రాహుల్
రవీంద్రన్, వెన్నెల కిషోర్, ఎస్.థమన్, కౌశల్ మండ తదితరులు ట్విట్టర్ ద్వారా ధోనీకి బర్త్డే
విషెస్ చెప్పారు. ధోనీ తమకు స్ఫూర్తి అని వీరిలో చాలా మంది పేర్కొన్నారు.
‘‘2011 ప్రపంచ కప్ గెలిచిన ఇండియా జట్టుకు నాయకత్వం వహించడం
దగ్గర నుంచి ఎన్నో క్రికెట్ రికార్డులను బ్రేక్ చేశారు. ఎన్నో కోట్ల మందికి మీరు
స్ఫూర్తి. దిగ్గజం, అసలుసిసలైన నాయకుడు అయిన ఎం.ఎస్.ధోనీకి పుట్టినరోజు
శుభాకాంక్షలు’’ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇక సందీప్ కిషన్ ధోనీని
ఒరిజినల్ ‘ఎ1 ఎక్స్ప్రెస్’గా అభివర్ణించారు. ధోనీ తనకు స్ఫూర్తి
అని చెప్పారు. వెన్నెల కిషోర్ అయితే ధోనీ తనకు ఆల్ టైమ్ ఫేవరేట్ అని పేర్కొన్నారు.
మొత్తం మీద ఈరోజు సోషల్ మీడియా ధోనీ బర్త్డే విషెస్తో నిండిపోతోంది.
అంతర్జాతీయ క్రికెట్లో మూడు
ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీ. మహేంద్రుడి నాయకత్వంలో టీమ్ ఇండియా 2007 ఐసీసీ
వరల్డ్ టీ20, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక బ్యాట్స్మన్, కీపర్గా
కూడా ధోనీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
జార్ఖండ్ డైనమైట్గా
పిలుచుకునే ఎం.ఎస్.ధోనీ ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్గా పేరొందారు. అలాగే, వికెట్ల
చురుకుగా కదులుతూ అత్యంత వేగంగా స్టంప్ ఔట్లు చేయడంలోనూ ధోనీ దిట్ట.
క్రికెట్కు ధోనీ
అందించిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన్ని రాజీవ్ ఖేల్ రత్న (2007), పద్మశ్రీ (2009), పద్మభూషణ్ (2018)
పురస్కారాలతో సత్కరించింది. 2008, 2009 సంవత్సరాల్లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా కూడా ధోనీ నిలిచారు. 2014లో
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ 2017లో వన్డే, టీ20 టీమ్ల కెప్టెన్ పదవి నుంచి కూడా తప్పుకున్నారు.
ప్రస్తుతం ఐపీఎస్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా కొనసాగుతున్నారు.