వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ
By: chandrasekar Sat, 25 July 2020 10:24 AM
మాజీ మంత్రి వైఎస్
వివేకానందరెడ్డి హత్య కేసు చేధించడానికి సీబీఐ మరోమారు పులివెందులలో ఆయన
నివాసాన్ని పరిశీలించింది. 10 మందికి పైగా సీబీఐ అధికారుల బృందం వివేకా హత్య
జరిగిన ప్రదేశంలో అణువణువూ పరిశీలించింది. పులివెందుల టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లతో
ఇంటి మ్యాప్ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు.
వివేకా ఇంటి పరిసర
ప్రాంతాలన్నింటినీ ఆమె కుమార్తె సునీత దగ్గరుండి మరీ సీబీఐ అధికారులకు చూపించారు.
వివేకా హత్య జరిగిన సమయంలో ఓ గది తలుపు తెరుచుకుని ఉన్న విషయాన్ని సునీత సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హత్య
జరిగిన పడకగది, స్నానపు గదిని పరిశీలించారు. ఇంటిపైకెక్కి కూడా
అధికారులు నిశితంగా పరిశీలించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటి బయట
నిద్రిస్తున్న వాచ్మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
ఈ హత్య కేసులో సీబీఐ
అధికారులు సీన్ రీకనెస్ట్రక్షన్ చేస్తున్నారు. ఉదయం 11 గంటల
నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. హత్య జరిగిన రోజు ఏం జరిగి ఉంటుందన్న దానిపై
సునిశితంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ సాంకేతిక బృందం పరిశీలిస్తోంది.
వాచ్మన్ రంగన్నను ఘటనాస్థలికి తీసుకెళ్లి సీబీఐ అధికారులు విచారించారు.
మరో నిందితుడు ఎర్ర
గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్
ప్రసాద్ని వివేకా ఇంటికి పిలిపించి సీబీఐ అధికారులు విచారించారు. కేసు విచారణలో
భాగంగా ఢిల్లీ, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందంగా వచ్చిన సీబీఐ
అధికారులు గత కొద్ది రోజులుగా కడపలోనే మకాం వేసిన విషయం తెలిసిందే. కడప నుంచి
పులివెందుల రోజూ వెళ్తూ విచారణ జరుపుతున్నారు.