- హోమ్›
- వార్తలు›
- హైకోర్టు న్యాయమూర్తులనుద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై సీబీఐ ఛార్జీషీట్
హైకోర్టు న్యాయమూర్తులనుద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై సీబీఐ ఛార్జీషీట్
By: chandrasekar Mon, 16 Nov 2020 8:45 PM
సోషల్ మీడియాలో హైకోర్టు
న్యాయమూర్తులనుద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై ఛార్జ్ షీట్ దాఖలు. ఏపీ హైకోర్టు
న్యాయమూర్తులనుద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు
చేసిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో గతంలో సీఐడీ నమోదు చేసిన
కేసులను పరిశీలించిన సీబీఐ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది. గతంలో
హైకోర్టు ఆదేశాల మేరకు 17మందిపై సీఐడీ కేసులు నమోదు చేయగా వారిపైనే ఇపుడు
సీబీఐ కూడా కేసు నమోదు చేసింది.
కాని అప్పుడు సీఐడీ
దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆ తర్వాతనే ఈ విషయంలో
దర్యాప్తు చేయాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి
దిగిన సీబీఐ అధికారులు 12 కేసులను విశాఖలో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం సీబీఐ
ఇన్వెస్టిగేటింగ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం పదిహేడు మందిపై కేసు
నమోదు చేయగా వారిలో ముగ్గురు విదేశీయులున్నారు.
ఈ వ్యవహారంపై హైకోర్ట్
రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఈ పదిహేడు మందిపై 153ఎ, 504, 505(2), 506 ఐపీసీతో పాటు 67 ఐటీ యాక్ట్ కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఏ1గా
కొండారెడ్డి, ఏ2గా మణిఅన్నపు రెడ్డి, ఏ3గా
సుధీర్ పాముల, ఏ4గా అద్రాస్ రెడ్డి, ఏ5గా
అభిషేక్ రెడ్డి, ఏ6గా శివారెడ్డి, ఏ7గా శ్రీధర్ రెడ్డి, ఏ8గా
వెంకట సత్యనారాయణ, ఏ9గా జీ.శ్రీధర్ రెడ్డి, ఏ10గా
లింగా రెడ్డి, ఏ11గా చందు రెడ్డి, ఏ12గా శ్రీనాథ్ సుస్వరం, ఏ13గా
కిషోర్ రెడ్డి, ఏ14గా చిరంజీవి, ఏ15గా లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ16గా
కె.గౌతమి, ఏ17గా
అనౌన్ (గుర్తు తెలియని) వ్యక్తులను పేర్కొన్నారు. ఈ 17
మందిపై సోషల్ మీడియా, మీడియాలోను న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను
అభియోగాలను నమోదు చేశారు. వీరిపై విచారణ చేపట్టి చర్య తీసుకోనున్నారు.