Advertisement

బండి సంజయ్ , అక్బరుద్దీన్ ఒవైసి లపై కేసు నమోదు

By: Sankar Sat, 28 Nov 2020 12:43 PM

బండి సంజయ్ , అక్బరుద్దీన్ ఒవైసి లపై కేసు నమోదు


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకున్నందుకు గాను పోలీసులు సుమోటాగా స్వీకరించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

బీజేపీ నేత బండి సంజయ్ ఎర్రగడ్డ డివిజన్‌‌లో ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు విగ్రహాలు కూల్చాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ ‘ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని సుమోటాగా తీసుకున్న ఎస్సార్‌ నగర్ పోలీసులు ఐపీసీ 505 కింద కేసు నమోదు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న ఇరు పార్టీలు ఒకిరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇటీవల పాతబస్తీలో సర్జికల్ స్టైక్ చేస్తామన్న బీజేపీ నేతలపై చాలామంది మండిపడ్డారు. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచిదని ఓ వైపు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా రాజకీయ పార్టీల నేతలు మాత్రం వినడంలేదు. ఇటీవల టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసిన కేసులో నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :
|

Advertisement