Advertisement

ట్రక్ మరియు కారు డీ ..అయిదుగురు సజీవ దహనం

By: Sankar Tue, 17 Nov 2020 1:37 PM

ట్రక్ మరియు కారు డీ  ..అయిదుగురు సజీవ దహనం


ట్రక్కును కారు ఢీకొట్టిన సంఘటనలో మంటలు వ్యాపించి ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్‌-సునమ్‌ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది.

ఘటనకు సంబంధించిన వివరాలను సంగ్రూర్‌ ఎస్పీ వివేక్‌ షీల్‌ సోని వెల్లడించారు. సంగ్రూర్‌ జిల్లాలోని దిర్బా పట్టణంలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఐదుగురు సోమవారం అర్ధరాత్రి మోగాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సంగ్రూర్‌-సునమ్‌పై కారు ఓ ట్రక్కు డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టింది.

దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోవడంతో సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు వైద్యుడు ఉన్నారని ఆయన తెలిపారు.



Tags :
|
|
|

Advertisement