Advertisement

  • విశాఖలో కారులో నుంచి మంటలు..డ్రైవర్ తో సహా తప్పించుకున్న ప్రయాణికులు

విశాఖలో కారులో నుంచి మంటలు..డ్రైవర్ తో సహా తప్పించుకున్న ప్రయాణికులు

By: Sankar Mon, 31 Aug 2020 8:52 PM

విశాఖలో కారులో నుంచి మంటలు..డ్రైవర్ తో సహా తప్పించుకున్న ప్రయాణికులు


విశాఖలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలి సమీపంలో ఉన్న కుమారి కళ్యాణ మండపం దగ్గర నడిరోడ్డుపై కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

కారులో నుండి అకస్మాత్తుగా మంటలు రావడంతో.. డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. వెంటనే కారులో ఉన్న అందర్ని అలర్ట్ చేయడంతో కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. మంటల్ని ఆర్పేశారు.. ప్రమాదంలో కారు మొత్తం పూర్తిగా కాలిపోయింది.

కారు ఎయిర్ పోర్ట్ నుంచి సింహాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ సహా నలుగురు ప్రయాణికులు కారులో ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.. ఉన్నట్టుండి కారు ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

Tags :
|
|
|
|
|
|

Advertisement