Breaking News: గూడురు వైసీపీ ఎమ్మెల్యే కు యాక్సిడెంట్... ఆసుపత్రికి తరలింపు..!
By: Anji Tue, 13 Oct 2020 10:27 AM
గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, వరప్రసాద్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఈ క్రమంలో హరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వరప్రసాద్ని చెన్నైకి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. ముందు మెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Tags :
guduru |
mla |