Advertisement

ఔటర్ పై కారు టైర్ ఊడి ఐదుగురికి తీవ్ర గాయాలు..

By: Sankar Mon, 21 Sept 2020 2:47 PM

ఔటర్ పై కారు టైర్ ఊడి ఐదుగురికి తీవ్ర గాయాలు..


హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు హిమాయత్‌ సాగర్‌ వద్దకు రాగానే టైరు ఊడిపోయి పల్టీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు నిన్న పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కూడా రెండు కారు ప్రమాదాలు జరిగాయి. అతివేగంతో వస్తున్న కార్లు డివైడర్‌ను ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో కూడా పలువురికి గాయాలయ్యాయి. అతివేగం ప్రమాదకరం అని పోలీసులు ఎంత చెబుతున్నా.. ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న కొందరు మాత్రం అవేం పట్టించుకోకుండా వాహనాల్ని నడుపుతున్నారు. అనవసరంగా తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Tags :
|

Advertisement