Advertisement

  • విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెన పైనుంచి కిందకు పడ్డ బస్సు

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెన పైనుంచి కిందకు పడ్డ బస్సు

By: Sankar Thu, 10 Sept 2020 08:14 AM

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెన పైనుంచి కిందకు పడ్డ బస్సు


విశాఖ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చేటు చేసుకుంది. జాతీయ రహదారి వంతెనపై నుండి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు 14 అడుగుల లోతులో పడిపోయింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి బస్సు విశాఖ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా బస్సులో కేవలం ఐదుగురు ప్రయాణీకులు మాత్రమే ఉండటంతో ఘోర ప్రమాదం తప్పయిపోయింది. ప్రమాదం జరిగిన తరవాత స్థానికులు అక్కడకు చేరుకుని. క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం తోనే ఈ ప్రమాదం సంభవంచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు..

మాములు సమయంలో అయితే ప్రాణనష్టం సంబవించేది..కానీ కరోనా కారణంగా చాల మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు..దీనితో బస్సులో కేవలం అయిదుగురు ప్రయాణికులే ఉన్నారు..దీనితో పెద్ద ప్రమాదం తప్పింది..

Tags :
|
|

Advertisement