Advertisement

  • ఒంగోలు లో విషాదం ..హార్ట్ ఎటాక్ తో బస్సు నడుపుతూనే మృతి చెందిన డ్రైవర్

ఒంగోలు లో విషాదం ..హార్ట్ ఎటాక్ తో బస్సు నడుపుతూనే మృతి చెందిన డ్రైవర్

By: Sankar Fri, 04 Sept 2020 8:18 PM

ఒంగోలు లో విషాదం ..హార్ట్ ఎటాక్ తో బస్సు నడుపుతూనే మృతి చెందిన డ్రైవర్


బస్సు నడుపుతూనే హార్ట్ ఎటాక్ తో ఆర్టీసీ డ్రైవర్ మరణించిన సంఘటన శుక్రవారం ఒంగోలులో జరిగింది. పొదిలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ..బస్సు ఒంగోలుకు చేరుకోగానే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో డ్రైవర్ హనుమంతరావు బస్సును సైడుకు ఆపి సీటులోనే కుప్పకూలిపోయాడు.

గుర్తించిన ప్రయాణికులు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులున్నారు. గుండెపోటు వచ్చినప్పటికీ బస్సును సేఫ్ ప్లేస్ లో పెట్టి, ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ హనుమంతరావు.. చివరకు తాను మాత్రం ప్రాణాలు వదిలాడని ఆవేదన వ్యక్తం చేసింది యాజమాన్యం.

అయితే గుండెపోటు వచ్చిన కూడా తాను చేసిన వృత్తిలో ప్రజలను కాపాడాలని బస్సును ఒక పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది దీనితో ప్రయాణికులకు ఎవ్టువంటి ఆపద కలగలేదు ..కరోనా సమయం కావడంతో బస్సులో ప్రయాణికులు కూడా ఎక్కువగా లేరు..

Tags :
|

Advertisement