కేసీఆర్ పై విరుచుకు పడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
By: chandrasekar Wed, 03 June 2020 5:38 PM
ప్రజలను మోసం చేయడమే
కేసీఆర్ ఉద్దేశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఏ ఆకాంక్షల
కోసమైతే తెలంగాణ సాధించుకున్నమో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. తెలంగాణలో అన్ని
వర్గాల ప్రజలను కెసిఆర్ మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్
ఇండ్లు ఇస్తామని ఓట్లు వేసుకుని ఇండ్లు ఇవ్వలేదన్నారు. దళితులకు 3 ఎకరాల
భూమి హామీ కూడా అమలు కాలేదన్నారు. చెప్పిన
పంట వేయాలని రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్ మాటలు నమ్మితే రైతులు
మోసపోతారన్నారు. భూ సార పరీక్షలు చేయకుండా చెప్పిన పంట ఎలా వేస్తారని ప్రశ్నించారు. రూ.125
కోట్లను భూసార పరీక్షల కోసం కేంద్రం డబ్బులు ఇస్తే భూ సార పరీక్షలు చేయలేదన్నారు.
అమర వీరుల త్యాగాల ఫలితం
ఒక మూర్ఖుడు కెసిఆర్ చేతిలో ఉందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్
దోచుకుంటున్నారన్నారు. మలి దశ ఉద్యమం ప్రజలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.
ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. బతికున్నంత వరకు రైతుబంధు అని చెప్పి నేను
తర్వాత సాగుతో రైతు బంధు ఇవ్వొద్దని చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని
అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు. తమకు రావాల్సిన నీటి కోసం బిజెపి తరఫున పోరాటం
చేస్తామన్నారు. 3 లక్షల
కోట్లు అప్పు చేసి 30 వేల
ఉద్యోగాలు కూడా కేసీఆర్ భర్తీ చేయలేదన్నారు.