Advertisement

మెట్రో ప్రయాణికులకు మరో బంపరాఫర్....!

By: Anji Sat, 31 Oct 2020 7:34 PM

మెట్రో ప్రయాణికులకు మరో బంపరాఫర్....!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఆదివారం నుంచి మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50 శాతం వరకు (రూ.600 వరకు) క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మెట్రో స్టేషన్లలో మాత్రమే కాకుండా, ఆన్‌లైన్‌లో రీఛార్జ్‌ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులోనే జమ అవుతుందని వివరించారు.

అయితే రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాలనే షరతు ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన అన్నారు. నగరంలోని మూడు కారిడార్లలో కలిపి నిత్యం 1.30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారని వివరించారు.

ఇటీవల ప్రకటించిన మెట్రో సువర్ణ ప్యాకేజీలో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. ఆ ఆఫర్ పెట్టాక మెట్రో ప్రయాణికుల సంఖ్య దాదాపు 30 శాతానికి పైగా పెరిగిందని వివరించారు.

Tags :

Advertisement