- హోమ్›
- వార్తలు›
- పల్లె ప్రగతిలో మంచి ప్రగతి కనబరిచిన కొత్త పంచాయితీలకు భవనాలు మంజూరు ..గద్వాల జిల్లా కలెక్టర్
పల్లె ప్రగతిలో మంచి ప్రగతి కనబరిచిన కొత్త పంచాయితీలకు భవనాలు మంజూరు ..గద్వాల జిల్లా కలెక్టర్
By: Sankar Mon, 02 Nov 2020 11:03 AM
గద్వాల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఐదు గ్రామ పంచాయతీలకు రాష్ట్రీయగ్రామ స్వరాజ్ యోజన పథకం కింద రూ. 20లక్షల అంచనాలతో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తూ ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేసి నట్లు కలెక్టర్ శృతిఓఝా తెలిపారు.
పంచాయతీ భవనాలు మంజూరైన నూతన గ్రామ పంచాయతీల్లో పెద్దతండా(మల్దకల్),గంగిమాన్దొడ్డి(గట్టు), పడమటిగార్లపాడ్ (రాజోళి), ఉమిత్యాలతాండ(కేటీదొడ్డి), తిమ్మాజిపల్లి(వడ్డేపల్లి) గ్రామాలు ఉన్నాయని తెలిపారు. పల్లె ప్రగతిలో మంచి ప్రగతి కనబర్చిన నూతన పంచాయతీలకు ఈ భవనాలు మంజూరైనట్లు చెప్పారు.
త్వరలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ అధికారులు ఆయా పంచాయతీల్లో స్థల సేకరణ చేసి ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు.