Advertisement

గత వందేళ్లలో లేని విధంగా బడ్జెట్‌

By: chandrasekar Sat, 19 Dec 2020 4:19 PM

గత వందేళ్లలో లేని విధంగా బడ్జెట్‌


సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాబోయే కేంద్ర బడ్జెట్‌ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ... గత వందేళ్లలో లేని విధంగా ఈ బడ్జెట్‌ ఉంటుందన్నారు. పరిశ్రమ వర్గాలు ఈ బడ్జెట్‌ కోసం తమ సలహాలు, సూచనలు పంపాలని కోరారు. రాబోయే సాధారణ బడ్జెట్‌లో సామాజిక మౌలిక రంగానికి మరిన్ని పెట్టుబడులు ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టేలా తన బడ్జెట్‌ ఉంటుందన్నారు. కరోనా‌ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో భారత్‌ కీలకం కానుందని నిర్మల అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్యం, పరిశోధన, అభివృద్ధి వంటి రంగాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు.

కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు చేయూత ఇవ్వడంతో పాటు వృద్ధికి దోహదం చేసే కొత్త రంగాలనీ వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సహిస్తామన్నారు. దేశంలో ఆస్పత్రుల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రైవేటు భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. దీని నిర్వహణకు నైపుణ్యాలు అత్యంత కీలమని స్పష్టం చేశారు. దేశ అవసరాలతో పాటు కొవిడ్‌తో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఎగుమతి చేసే సత్తా మన దేశానికి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇతర దేశాల్లో అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్ల మేధో సంపత్తి హక్కులు కొనుక్కుని వాటిని పూర్తిగా దేశంలోనే తయారు చేసే సత్తా భారత కంపెనీలకు ఉందన్నారు. కరోనా‌ నేపథ్యంలో ఉద్యోగాల స్వరూపమూ మారిపోతోందని నిర్మల అన్నారు. టెలిమెడిసిన్‌ వంటి రంగాల్లో పని చేసేందుకు కొత్త నైపుణ్యాలు అవసరమన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలోనూ మన పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండబోతోంది’ అని అన్నారు.

Tags :
|

Advertisement