Advertisement

కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీ కొనసాగిస్తారా !

By: Sankar Tue, 15 Sept 2020 07:38 AM

కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీ కొనసాగిస్తారా !


బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అనేక వివాదాల నడుమ ముంబై నగరాన్ని వీడి తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ చేరుకున్నారు. ఎన్నో వివాదాల మధ్య సెప్టెంబర్ 9న ముంబై వెళ్లిన కంగనా సోమవారం ఉదయం మనాలిలోని తన ఇంటికి చేరుకున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఉద్దేశించి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తనకు ప్రాణాపాయం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కంగనా రనౌత్‌కు ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే కంగనాకు సెక్యూరిటీని తొలగించాలని సుప్రీం కోర్టు అడ్వొకేట్‌ బ్రిజేష్‌ కలప్ప ట్వీట్‌ చేశారు. ‘‘ఒక్క మనిషికి నెల రోజుల పాటు ‘వై ప్లస్‌’ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంపై రూ. 10 లక్షల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్ని అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగన హిమాచల్‌ ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కంగనాకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెబుతుందా?’’ అని పేర్కొన్నారు.

దీనికి కంగన స్పందిస్తూ.. ‘బ్రిజేష్‌ జీ.. మీరు, నేను ఊహించుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) ఓ వ్యక్తికి అపాయం ఉందా? లేదా? అనే విషయాన్ని విచారించి దాని ఆధారంగా సెక్యూరిటీ గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో భద్రతను పూర్తిగా తీసేయొచ్చు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదికలో నాకు ప్రమాదం ఉందని తెలిస్తే భద్రతను మరింత పెంచొచ్చు’ అని అన్నారు.

Tags :
|

Advertisement