ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు దాడులు
By: chandrasekar Wed, 09 Sept 2020 09:51 AM
ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు దాడులు చేసారు. సుశాంత్ సింగ్ మరణించిన తరువాత నేపాటిసమ్ పై కంగనా రనౌత్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముంబై పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్న కంగనాని ఆ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సోమవారం ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు దాడులు చేశారు.
తన కార్యాలయం పై జరిగిన దాడికి కంగనా స్పందిస్తూ.. దీనిపై 15 ఏళ్ళ కష్టానికి ప్రతి ఫలం ముంబైలోని మణికర్ణిక కార్యాలయం. ఇందులోకి బీఎంసీ అధికారులు బలవంతంగా చొరబడ్డారు అని తెలిపారు. అన్ని కొలతలు చూసుకున్నారు. ప్రశ్నించిన నా బంధువులపై బెదిరించారు. ఆమె ప్రవర్తనకు మూల్యం చెల్లించాల్సిందే అంటూ వారు బెదిరించారని కంగనా పేర్కొంది. అయినప్పటికి తన వద్ద అన్ని పేపర్లు ఉన్నాయని, బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. తన ప్రాపర్టీలో ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదని స్పష్టం చేశారు కంగనా.
జరిగిన సంఘటనపై ఆమె మాట్లాడుతూ.. రేపు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆఫీసును కూల్చేస్తారని కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ సర్వేలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు చెప్పిన బీఎంసీ అధికారులు ఈ రోజు ఆమె కార్యాలయానికి స్టాప్ వర్క్ నోటీసులు అంటించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్
354 / ఎ కింద, బిఎంసి సభ్యులు నటి కార్యాలయ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించారు. అనుమతులు ఉంటే అధికారులకు చూపించాలని లేదంటే కూల్చివేత చర్యలు తప్పవని అధికారులు తేల్చిచెప్పారు. కొంత స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తెలుస్తోందని, అందుకే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఇవన్నీ కుట్రతో కూడుకున్న పనిగా ఆమె తెలిపారు.