అభిషేక్ బచ్చన్ , నిత్య మీనన్ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రారంభం
By: Sankar Sat, 13 June 2020 5:28 PM
అలా మొదలైంది’ అంటూ తెలుగు సినిమాల్లో కెరీర్ మొదలు పెట్టిన బొద్దు గుమ్మ నిత్యా మీనన్. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్లో ఆఫర్లు కొట్టేసింది. నితిన్ తో కలిసి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, జబర్దస్త్ లాంటి చిత్రాల్లో నటించింది. సెగ,180 వంటి చిత్రాలు చేసింది. తన దైన స్టైల్లో నటనలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. పాటలు కూడా పాడి అలరించింది ఈ భామ. పాత్ర నచ్చితేనే నటించడానికి నిత్యామీనన్ ఆసక్తి చూపుతారు. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఈ బొద్దుగుమ్మ తాజాగా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు.
కొన్ని నెలల నుండి నిత్యామీనన్ డిజిటల్ ఎంట్రీపై వార్తలు వినపడుతూ
వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్
బచ్చన్తో కలిసి ‘బ్రీత్... ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్లో నటించింది.
అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్లో అమిత్ సాద్,
సయామీఖేర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. రెండో సిరీస్ కు సంబంధించిన
ఫస్ట్ లుక్ ను అభిషేక్ విడుదల చేశారు. జులై 10న ఈ సీజన్ ప్రారంభం
కాబోతోంది. మయాంక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సీజన్ 1 ను సైకలాజికల్
థ్రిల్లర్ గా రూపొందించారు.
ఈ సందర్భంగా వెబ్ సిరీస్ పై స్పందిస్తూ
నిత్యామీనన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. వెబ్ సిరీస్
ద్వారా అందరినీ పలకరించడం సంతోషంగా ఉందంటోంది నిత్యా మీనన్. ఇటీవలే నిత్య
బాలీవుడ్ మూవీ మిషన్ మంగళ్యాన్లో నటించిన విషయం తెలిసిందే. నిత్యా తాజాగా
జయలలిత బయోపిక్లో నటిస్తున్నారు. ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కుతున్న ఒక
సినిమాలో నిత్య జయలలిత పాత్ర చేస్తున్నారు. జయలలిత కొంచెం లావుగా ఉంటారు
కాబట్టి ఆమె లుక్ కోసమే నిత్య బరువు పెరిగింది.