బ్రేకింగ్ న్యూస్: హాస్పిటల్ పై నుంచి దూకి కరోనా రోగులు ఆత్మహత్య..!
By: Anji Thu, 01 Oct 2020 7:00 PM
కరోనా రోగుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో కరోనా సోకిన 56 ఏళ్ల ఓ వ్యక్తి కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు తన కుమారుడిని ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పాడు. కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా సూచించాడు.
సంగ్లి జిల్లా మిరాజ్లోని హాస్పిటల్లో కొవిడ్ కేర్ విభాగంలో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. బాధితుడు హాస్పిటల్ బెడ్పై కూర్చొని గొంతు కోసుకున్న దృశ్యాలు వార్డులో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అయితే తాజాగా.. సూరత్లో కొవిడ్-19 బారినపడ్డ ఓ వ్యక్తి హాస్పిటల్లో 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. గుజరాత్లోని సూరత్ పట్టణంలో గురువారం (అక్టోబర్ 1) ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న బాధితుడు రెండు రోజుల కిందట వైరస్ బారినపడటంతో కొవిడ్ కేర్ సెంటర్లో చేరినట్లు అధికారులు తెలిపారు. కరోనా బారినపడటంతో ఒత్తిడికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐసీయూ కిటికీలో నుంచి దూకిన మరొక రోగి..
ఔరంగాబాద్లో మరో రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెప్టెంబర్ 25న కరోనాతో ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన 42 ఏళ్ల ఓ వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు అతడు హాస్పిటల్లో తన బెడ్డు పక్కన ఉన్న కిటికీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మహారాష్ట్రలో ఒకే రోజు ఇద్దరు కరోనా రోగులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.