Advertisement

హైదరాబాద్లో కరోనా టెస్టులకు బ్రేక్

By: Sankar Thu, 25 June 2020 3:56 PM

హైదరాబాద్లో కరోనా టెస్టులకు బ్రేక్



తెలంగాణ రాష్టంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి ..గత వారం రోజులుగా కరోనా కేసుల తీవ్రత అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు..దీనికి గల ముఖ్య కారణం కరోనా టెస్టులను ఎక్కువగా చేయడం ..కరోనా టెస్టులు తక్కువ తక్కువ చేస్తున్నారు అని హైకోర్టులో కేసు వేయడంతో విచారించిన హైకోర్టు టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది ..దీనితో గత వారం రోజులుగా కరోనా టెస్టుల సంఖ్యా పెరిగింది . అయితే హైద్రాబాద్లో కరోనా టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ..

ఇప్పటికే సేకరించిన శాంపిళ్లను పరీక్షించకపోవడంతో.. గురు, శుక్రవారాల్లో శాంపిళ్లను సేకరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, పొరుగున ఉన్న జిల్లాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆశించిన రీతిలో టెస్టులు జరగడం లేదు. శాంపిళ్లను సేకరించినా.. టెస్టులకు సమయం పడుతుండటంతో శాంపిళ్ల సేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు వేసింది..

ప్రభుత్వ, ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ బుధవారం గరిష్టంగా 4,069 కరోనా టెస్టులు చేశారు. టెస్టులు ఆశించిన వేగంగా జరగకపోవడంతో.. పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేకపోయింది. రోజుకు ఐదు వేల కరోనా టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న కోబాస్ 8800 మెషిన్‌ను సీఎస్‌ఆర్ కింద తెలంగాణ కోసం ఆర్డర్ చేయగా.. దాన్ని కోల్‌కతాకు తరలించాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో టెస్టులు చేయలేకపోవడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.

Tags :
|
|
|
|

Advertisement