ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా అద్భుతమైన స్కెచ్ వేసిన బ్రహ్మానందం
By: chandrasekar Thu, 06 Aug 2020 5:37 PM
అయోధ్యలో ఆగస్టు 5 రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన సంగతి
తెలిసిందే. ఈ సంతోషఘడియల కోసం కొన్ని తరాలుగా పోరాటం సాగింది. ఆ అపురూప దృశ్యాలను
చూసి కోట్లాది మంది భారతీయులు తరించిపోయారు. ఈ సమయంలోనే తన అద్భుత కళను మరోసారి
బయటపెట్టి ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా సూపర్ స్కెచ్ వేశారు వెండితెరపై నవ్వులు పూయించే
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. లాక్డౌన్ కారణంగా గత కొన్నినెలలుగా ఇంటికే పరిమితమైన
బ్రహ్మానందం. కొద్ది రోజుల క్రితమే కరోనాపై అద్భుతమైన చిత్రం గీసి అందరిని
దృష్టిని ఆకర్షిస్తూ తనలో ఉన్న చిత్రకళను ఆవిష్కృతం చేశారు. ఈ క్రమంలోనే అయోధ్యలో
రామ మందిర భూమి పూజ సందర్భంగా మరోసారి తన ట్యాలెంట్ చూపిస్తూ శ్రీరాముడి స్కెచ్
వేశారు.
''ఆంజనేయుని
ఆనంద భాష్పాలు'' అని
పేర్కొంటూ శ్రీ రాముడిని ఆలింగనం చేసుకుని ఆంజనేయుడు తన్మయత్వంతో కన్నీళ్లు
కారుస్తున్న అద్భుత చిత్రాన్ని గీసి ఆడియన్స్ని ముగ్ధుల్ని చేశారు. అయోధ్యలో
రాముడికి గుడి కడుతున్న సందర్భంగా హనుమంతుడు ఆనందపడుతున్నట్లు బ్రహ్మానందం గీసిన ఈ
స్కెచ్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవలే మీడియాతో లాక్డౌన్ అనుభవాలు పంచుకున్న
బ్రహ్మానందం. ఈ ఖాళీ సమయంలో బోలెడన్ని పుస్తకాలు చదివానని చెప్పారు. ఖురాన్ కూడా
అధ్యయనం చేశానని అన్నారు. ఆ పవిత్ర గ్రంథంలో ఏయే అంశాలున్నాయి? మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు? అనే విషయాలు తెలుసుకున్నానని ఆయన తెలపడం విశేషం.
అంతేకాదు ఇంట్లో మనవడితో
ఆటలాడుతుంటే సమయమే తెలియడం లేదని, చాలా
సరదాగా అనిపిస్తోందని బ్రహ్మానందం చెప్పారు. కొన్నేళ్లుగా కామెడీకి కేరాఫ్ అడ్రస్
తానే అన్నట్లుగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఈ హాస్య బ్రహ్మ. ఈ మధ్య కాలంలో
సినిమాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న
‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది ట్రాజెడీ రోల్ అని
తెలుస్తోంది. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ని
రీమేక్ చేయబోతున్నారు. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందుతోంది.