Advertisement

  • విచిత్ర సంఘటన: భర్తను వదిలి వచ్చిన తర్వాత ప్రియుడు పరార్

విచిత్ర సంఘటన: భర్తను వదిలి వచ్చిన తర్వాత ప్రియుడు పరార్

By: Anji Sat, 29 Aug 2020 12:07 PM

విచిత్ర సంఘటన: భర్తను వదిలి వచ్చిన తర్వాత ప్రియుడు పరార్

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా ప్రియుడు భర్తను వదిలి వచ్చేయమంటాడు. తీరా భర్తను వదిలి వచ్చిన తర్వాత ప్రియుడు పరార్ వివరాల్లోకి వెళితే....

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లెంతకుంట మండలానికి చెందిన రజిత-రమేష్ ప్రేమించుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. అదే టైమ్ లో రజితకు ఇంట్లో సంబంధాలు చూశారు. శేఖర్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రజిత ప్రియుడు రమేష్ మాత్రం ఆమెను వదల్లేదు. ఏకంగా రజిత అత్తవారింటికి వెళ్లి, రజితను తనతో పంపించమని వేడుకునేవాడు. రజితను కూడా తనతో వచ్చేయమని బలవంతం చేయసాగాడు. ఈ క్రమంలో విసిగిపోయిన శేఖర్ తల్లిదండ్రులు.. రజితను ఇంటి నుంచి పంపించేశారు.

అలా భర్తకు దూరమైన రజిత.. ప్రియుడు రమేష్ ఇంటికి చేరుకుంది. అయితే అక్కడ రమేష్ తల్లిదండ్రులు అడ్డంతిరిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. కానీ న్యాయం రజితవైపే మొగ్గుచూపింది. పెద్దల సమక్షంలో 6 నెలల్లో రజిత-రమేష్ పెళ్లి చేయాలనే ఒప్పందం కుదిరింది.

అంతా ఓకే, కథ సుఖాంతం అనుకున్న టైమ్ కు ఊహించని పరిణామం. రమేష్, తన కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడు. దీంతో రజిత రోడ్డున పడింది. అటు భర్త దగ్గరకు వెళ్లలేక, ఇటు ప్రియుడి ఆచూకి తెలియక ఆమె సతమతమౌతోంది.

Tags :

Advertisement