బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, ఎంపీకి కరోనా...
By: chandrasekar Wed, 02 Dec 2020 3:50 PM
దేశంలో సాధారణ
ప్రజలతోపాటు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా
బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు సైతం
కరోనావైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
హిమాచల్ ప్రదేశ్
రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా గడుపుతున్న సన్నీడియోల్కు కరోనా
పరీక్ష జరపగా.. పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థి
తెలిపారు.
గతకొన్ని రోజుల నుంచి
ఎంపీ సన్నీ డియోల్, ఆయన స్నేహితులు కుల్లూ జిల్లాలో ఉంటున్నారు. కుల్లూ
నుంచి ముంబై నగరానికి వెళ్లాలనుకున్న క్రమంలో సన్నీడియోల్ కరోనా పరీక్ష
చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య కార్యదర్శి పేర్కొన్నారు.
64 ఏళ్ల సన్నీడియోల్ ఇటీవల ముంబైలో భుజానికి
శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం కుల్లూ జిల్లా మనాలీ సమీపంలోని ఫాం హౌస్లో
విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సన్నీ
డియోల్ పంజాబ్ గురుదాస్పూర్ ఎంపీగా ఉన్నారు.