Advertisement

బాలీవుడ్‌ సీనియర్ నటి 'కుంకుం' కన్నుమూత

By: chandrasekar Wed, 29 July 2020 12:22 PM

బాలీవుడ్‌ సీనియర్ నటి 'కుంకుం' కన్నుమూత


సీనియర్ నటి కుంకుం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 86 ఏళ్లు. బాలీవుడ్‌లో సీనియర్ నటిగా పేరున్న కుంకుం అనేక చిత్రాల్లో నటించడంతో పాటు పలు సినిమాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించారు. మదర్ ఇండియా, నయా దోర్, కోహినూర్, ఉజాలా, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే, శ్రీమాన్ ఫాంతూష్, గంగా కి లెహరె, రాజా ఆర్ రంక్, ఆంఖే, లాల్కర్, గీత్ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 1963లో మొట్టమొదటిసారిగా భోజ్‌పురిలో తెరకెక్కిన '' గంగా మైయ తోహె పియారి చడాయిబో'' చిత్రంలోనూ కుంకుం నటించారు.

సీఐడి చిత్రంలో యే హై మేరీ జాన్ అనే ఫేమస్ పాటను కూడా కుంకుంపైనే చిత్రీకరించారు.

సీనియర్ నటి కుంకుం మృతిపై బాలీవుడ్ దిగ్భాంతి వ్యక్తంచేసింది. ఆమెతో, ఆమె కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న పలువురు నటీనటులు ఆమెతో తమకు ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నివాళి అర్పించారు. కుంకుం మృతిపై జగదీప్ జాఫ్రి తనయుడు నవీద్ జాఫ్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తన తండ్రి జగదీప్‌తో కుంకుం కలిసి చేసిన సినిమాలు, తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఈ నవీద్ ఈ ట్వీట్ లో తెలియచేసారు.

Tags :
|
|

Advertisement