బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ కు అనారోగ్యం
By: chandrasekar Thu, 25 June 2020 6:36 PM
బాలీవుడ్ చిత్ర సీమలో
ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లతో స్టెప్పులు వేయించిన ప్రముఖ
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గురించి
తెలియని వారు ఎవరు ఉండరు. ఆమె యిప్పుడు తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ప్రముఖ
ఆసుపత్రిలో చేరారు. 71 ఏళ్ల వయసుకున్న ఈమె బ్రీతింగ్ ప్రాబ్లెమ్తో
ముంబైలోని బాంద్రాలో ఉన్న గురునానక్ హాస్పిటల్లో చేరారు.
శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న
సరోజ్ ఖాన్కు డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు నెగిటివ్ అని తేలింది.
ప్రస్తుతం సరోజ్ ఖాన్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా 2 వేలకు
పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు.
ముఖ్యంగా షారుఖ్ ఖాన్
హీరోగా నటించిన ‘దేవదాస్’ సినిమాలో ‘డోలా రే డోలారే ’ పాటతో పాటు ‘తేజాబ్’
సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ‘ఏక్ దో తీన్’ పాటలు ఆమెకు మంచి గుర్తింపును
ఇచ్చాయి. ముఖ్యంగా షాహిద్ కపూర్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘యే ఇష్క్ హై’ పాట ఆమెకు మంచి
పేరు తీసుకొచ్చాయి.
ఆమెకు నృత్య దర్శకత్వంలో
వచ్చిన మూడు చిత్రాలతో జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఆమె నృత్య దర్శకత్వం వహించిన పలు సినిమాల్లోని
కొరియోగ్రఫీకి 8
ఫిల్మ్ఫేర్ అవార్డులు కైవసం చేసుకుంది.
అంతేకాదు ‘వీరూ దాదా’, ‘ఖిలాడీ’
వంటి పలు చిత్రాలకు కథా రచయతగా పనిచేశారు. మరోవైపు పలు ప్రైవేటు ఛానెల్స్లో
నిర్వహించే డాన్స్ రియాలిటీ షోస్కు ఆమె న్యాయ నిర్ణేతగా ఉన్నారు.