ఇంట్లో జరిగిన పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ ఇవ్వలేదు : కరణ్ జోహార్
By: chandrasekar Sat, 26 Sept 2020 5:15 PM
సుశాంత్ సింగ్ రాజ్పుత్
మరణం తర్వాత డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు
చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ గర్ల్ఫ్రెండ్ను అరెస్ట్ చేసి
అనేక విషయాలు రాబట్టిన ఎన్సీబీ ప్రస్తుతం రకుల్, దీపికా, శ్రద్ధా, సారాలను
ప్రశ్నిస్తుంది.
ఈ నేపధ్యంలో ఫిల్మ్మేకర్
కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు
ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో కరణ్ జోహార్ శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
మీడియా వార్తలను కరణ్
ఖండిస్తూ తన ఇంట్లో జరిగిన పార్టీలో ఎవరూ
మాదక ద్రవ్యాలు తీసుకోలేదన్నారు. ఆ వార్తలు నిరాధారమైనవని, తప్పుడు
వార్తలు అని మండిపడ్డారు.
Tags :
party |